Delhi: వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు వృద్ధులు మృతి.. ఆరుగురికి గాయాలు

ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఆదివారం వేకువఝామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ (వృద్ధాశ్రమం)లో ఆదివారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అంటుకున్నాయి.

Delhi: వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు వృద్ధులు మృతి.. ఆరుగురికి గాయాలు

Delhi: ఢిల్లీలోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఢిల్లీ దక్షిణ ప్రాంతం, గ్రేటర్ కైలాష్-2 ఏరియాలో ఆదివారం వేకువఝామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ (వృద్ధాశ్రమం)లో ఆదివారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అంటుకున్నాయి.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఉదయం 05.15 నిమిషాలకు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ప్రారంభించే సమయానికి ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులతో కలిపి మొత్తం 13 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వీరిలో ఆరుగురికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Nitish Kumar: ‘కొత్త జాతి పిత’ దేశం కోసం ఏం చేశాడు? మోదీపై నితీష్ కుమార్ విమర్శలు

ఉదయం ఏడు గంటల సమయంలో మంటలను పూర్తిగా ఆర్పేసినట్లు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమానికి సరైన అనుమతులు ఉన్నాయా.. లేదా.. అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.