Road Accident : ఏజెన్సీ ప్రాంతంలో బస్సు, లారీ ఢీ-20 మందికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం న

Road Accident : ఏజెన్సీ ప్రాంతంలో బస్సు, లారీ ఢీ-20 మందికి గాయాలు

Road Accident in agency area

Road Accident :  తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం నుంచి కాకినాడ వస్తున్న గోకవరం డిపో ఆర్టీసీ బస్సు- చత్తీస్ ఘడ్ కు చెందిన  లారీని ఢీకొట్టింది.

ఈ  ప్రమాదంలో బస్సు  డ్రైవర్ తో   సహా 20 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి.  గాయపడిన వారిని మారేడుమిల్లి, రంపచోడవరం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. మారేడుమిల్లికి 3 కి.మీ దూరంలో ఉన్న వాలమూరు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

Also Read : Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త