Tirumala : తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న 27 మంది అరెస్ట్

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులను మోసగించే 27 మందిని అరెస్ట్ చేసినట్లు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు.

Tirumala : తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న 27 మంది అరెస్ట్

27 Arrested In Tirumala

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులను మోసగించే 27 మందిని అరెస్ట్ చేసినట్లు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుపతిలోని కొందరు ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు శ్రీవారి దర్శనార్థం వచ్చే టికెట్ లేని భక్తులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. కాలం చెల్లిన టికెట్లు, నకిలీ టికెట్లను భక్తులకు విక్రయించి వీళ్లు భక్తులను మోసం చేస్తున్నారు.

కొందరు ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్‌ల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ కొందరు భక్తులను మోసం చేస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేసే వారిని, దళారీలను గుర్తించి సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి వారిపై నిఘా పెడుతున్నామని ఆయన తెలిపారు.

తిరుమలలో మోసం చేస్తున్న దళారుల పైన పీడీ యాక్ట్‌ను కూడా నమోదు చేస్తామని మునిరామయ్య హెచ్చరించారు. తిరుమల తిరుపతిలో దళారులను గుర్తించడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేశామని….భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. భక్తులు శ్రీవారి దర్శనం టికెట్లను ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.