Vijayawada : అప్పుల భారంతోనే నిజామాబాద్ సురేష్ కుటుంబం ఆత్మహత్య

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Vijayawada : అప్పుల భారంతోనే నిజామాబాద్ సురేష్ కుటుంబం ఆత్మహత్య

Nizamabad Pappula suresh

Vijayawada :  విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లోని గంగస్థాన్ కాలనీలో నివసించే పప్పుల సురేష్ అతని భార్య శ్రీలత, కుమారులు అఖిల్, ఆశిష్ ఈరోజు తెల్లవారు ఝూమున విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు.

పప్పుల సురేష్ గతంలో మెడికల్ రంగంలో పని చేసేవారు. ఫార్మా ఫీల్డ్‌లో ఆర్ధికంగా నష్టపోయారు. ఈక్రమంలో సురేష్ కుటుంబం ఇటీవల చిట్టీల వ్యాపారం చేయటం ప్రారంభించింది. సురేష్ పెద్దకొడుకు అఖిల్ నిజామాబాద్‌లో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అప్పులు పెరగటంతో బంధువులు,స్నేహితులు, పరిచయస్తుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేశారు.
Also Read : karimnagar : కరీనంగర్ జిల్లాలో దారుణం : ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
బంధువులు, తెలిసినవారు చెప్పిన అంచనా ప్రకారం కోటి రూపాయల దాకా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబం 3 రోజులుగా కనపడకపోయేసరికి అప్పులు ఇచ్చిన వారు అపార్ట్ మెంట్‌కు వచ్చి వెళుతున్నారని అపార్ట్ మెంట్ వాసులు చెప్పారు. ప్రైవేట్ బ్యాంకర్లు ఇది వరకే ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళారని అపార్ట్ మెంట్‌లోని ఇరుగు పొరుగువారు తెలిపారు.