ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

  • Published By: nagamani ,Published On : June 19, 2020 / 05:16 AM IST
ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

మహారాష్ట్ర పూణెలోని విద్యాపీఠ్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం (జూన్ 19,2020)న వెలుగులోకి రావటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని సుఖ్‌సాగర్‌కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన అనంతరం వారు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

వాళ్లు ఎంతకూ తలుపులు తీయకపోవటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి చూసి పరిశీలించగా ఈ ఉదయం వారు నలుగురు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసినవారు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పరిశరాలను క్షుణ్ణం పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో సుఖ్‌సాగర్ ప్రాంతంలో విషాదం నెలకొంది.

చనిపోయినవారిలో 6ఏళ్ల బాలుడు..3ఏళ్ల బాలిక ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు కారణాలేమిటి? ఆర్థిక ఇబ్బందులా? లేదా వేరే కారణాలున్నాయా? వీరు పూణే నివాసులేనా?వీరి బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు? అనేకోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారి బంధువులను గుర్తించి సమచారం అందించేందుకు యత్నిస్తున్నారు.

Read: ఆసుపత్రిలో ఉరి వేసుకున్న COVID 19 రోగి