Uttar Pradesh: స్నేహితుడి మీద కోపంతో అతడి నాలుగేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసి.. చంపిన వ్యక్తి

స్నేహితుడి మీద కోపంతో అతడి నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ సంస్థ నుంచి తన పేరును తొలగించాడని ఓ వ్యక్తిపై బంటి (23) అనే యువకుడు పగ పెంచుకున్నాడు. అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బంటి భావిస్తున్నాడు. ఇంటి వద్ద ఆడుకుంటోన్న అతడి నాలుగేళ్ల కుమారుడిని బంటి అపహరించి తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడిని చంపేసి, తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

Uttar Pradesh: స్నేహితుడి మీద కోపంతో అతడి నాలుగేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసి.. చంపిన వ్యక్తి

Crime News

Crime News: స్నేహితుడి మీద కోపంతో అతడి నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ సంస్థ నుంచి తన పేరును తొలగించాడని ఓ వ్యక్తిపై బంటి (23) అనే యువకుడు పగ పెంచుకున్నాడు. అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బంటి భావిస్తున్నాడు. ఇంటి వద్ద ఆడుకుంటోన్న అతడి నాలుగేళ్ల కుమారుడిని బంటి అపహరించి తీసుకెళ్లాడు.

అనంతరం ఆ బాలుడిని చంపేసి, తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ బాలుడు కనపడకపోయేసరికి అతడి కుటుంబ సభ్యులు బాలుడి కోసం వెతకసాగారు. వారితో పాటే బంటి కూడా బాలుడిని వెతుకుతున్నట్లు నటించాడు. అయితే, ఆ సమయంలో తనకు బాలుడు ఎక్కడున్నాడన్న విషయాన్ని ఓ బాబా చెప్పాడని ఆ కుటుంబ సభ్యులకు బంటి చెప్పాడు. అనంతరం ఆ బాలుడి మృతదేహం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.

దీంతో అతడిపై పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా నిజం బయటపడింది. ఆ బాలుడి తండ్రి తనకు స్నేహితుడని, తాము గతంలో మిఠాయి దుకాణంలో పని చేశామని చెప్పాడు. అతడితో ఉన్న విభేదాల కారణంగా ఈ హత్య చేశానని అన్నాడు. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి నుంచి తుపాకీ కొన్నానని తెలిపాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఛాతీపై తుపాకీతో కాల్చిన గుర్తులు ఉన్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..