సెల్ఫీకి ఫోజులిస్తూ…డ్యాంలో పడి నలుగురు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2019 / 09:52 AM IST
సెల్ఫీకి ఫోజులిస్తూ…డ్యాంలో పడి నలుగురు మృతి

సెల్ఫీ మరణాలు రొజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. సెల్ఫీ మోజులో పడి నిత్యం పలువురు ఏదో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా భారతదేశంలోనే సెల్ఫీ మరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయంటే మనవాళ్లు సెల్ఫీ మోజులో ఎంతలా పడ్డారో అర్థమవుతోంది. సెల్ఫీ తీసుకుంటూ జలాశయంలో పడి నలుగురు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులో జరిగింది.

అయితే ఆదివారం(అక్టోబర్-6,2019)తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై తాలూకలోని  పాంబారు డ్యామ్ చూసేందుకు ఆదివారం చాలామంది తరలివచ్చారు. అక్కడి సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన నవదంపతులు…పెరుమాల్ సామి(24),నివేద(20),వారి ముగ్గురు కుటుంబసభ్యులు సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18)లు కూడా పాంబారు డ్యామ్ చూసేందుకు వెళ్లారు.

అందరూ రిజర్వాయర్ దగ్గర సెల్ఫీ తీసుకుంటన్న సమయంలో సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20)లు ప్రమాదవశాత్తూ గట్టుపై నుంచి నలుగురు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది.  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. సెల్ఫీ కోసం డ్యాంలో పడి ఇలా నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవడంతో… వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.