హాస్పిటల్ లో కరోనా బాధితురాలు అనుమానస్పద మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : June 2, 2020 / 01:35 PM IST
హాస్పిటల్ లో కరోనా బాధితురాలు అనుమానస్పద మృతి

త్రిపుర రాష్ట్రంలోని ఓ హాస్పిటల్ లో 50ఏళ్ల కరోనా బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజధాని అగర్తలాలోని జీబీ పంత్ గవర్నమెంట్ హాస్పిటల్ లోని బాత్ రూమ్ లో మంగళవారం(మే-2,2020)ఉదయం మహిళ బాడీ వేలాడుతుందన్న సమాచారంతో స్పాట్ కు వెళ్లారు పోలీసులు. తాడుకు వేలాడుతున్న మహిళ బాడీని కిందకు దించి పోస్ట్ మార్టం కొరకు పంపారు.

ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న మహిళ సోమవారం జీబీ పంత్ హాస్పిటల్ లోని ఫ్లూ వార్డులో చేరిందని,ఇవాళ ఉదయం..బాత్ రూమ్ లో వేలాడుతున్న ఆమె బాడీని కనుగొన్న ఆరు గంటల తర్వాత ఆమెకు కరోనా సోకినట్లు తేలిందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఎస్ కే రాకేష్ తెలిపారు.

కాగా,త్రిపుర రాష్ట్రంలో ఇప్పటివరకు 444కరోనా కేసులు నమోదయ్యాయి. 173మంది రికవరీ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక త్రిపురలో ఒక్క కరోనా మరణం కూడా లేదు.