Meghalaya : బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం..బాలికలను రక్షించి 73 మంది అరెస్ట్ చేసిన పోలీసులు

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ రిసార్ట్ లో వ్యభిచార గుట్టు దందా బయటపడింది. రిసార్ట్ పై రైడ్ చేసిన పోలీసులు బాలికలను రక్షించి 73 మంది అరెస్ట్ చేసారు.

Meghalaya : బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం..బాలికలను రక్షించి 73 మంది అరెస్ట్ చేసిన పోలీసులు

Prostitution At Meghalaya Bjp Vice President's Resort

Meghalaya : రిసార్ట్ ముసుగులో వ్యభిచారం నడుపుతున్నారనే ఆరోపణలపై మేఘాలయ పోలీసులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌ కోసం వెతుకుతున్నారు. వెస్ట్ గరోహిల్స్ జిల్లాలోని తురలోని బెర్నార్డ్ రిసార్ట్‌పై దాడిచేసిన పోలీసులు అక్కడ వ్యభిచారం జరుగుతోందని గుర్తించారు. ఈ దాడిలో పోలీసులు ఆరుగురు బాలికలను రక్షించారు. 73మందిని అరెస్ట్ చేశారు. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా వారిపై హింసకు పాల్పడేలా వ్యభిచారం చేయిస్తున్నారు. చిన్నారులను అపరిశుభ్రమైన గదుల్లో బంధించినట్లుగా పోలీసులు గుర్తించారు. తన బిడ్డ (బాలిక) కనిపించట్లేదని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ బాలిక కోసం గాలింపు కోసం యత్నిస్తుండగా బెర్నార్డ్ రిసార్ట్ లో వ్యభిచారం జరుగుతున్న విషయం బయటపడింది. పోలీసుల విచారణలో బెర్నార్డ్ రిసార్ట్ లో వ్యభిచార గుట్టు దందా బయటపడింది. మిస్ అయిన సదరు మహిళ కూతురుని తుర గరోహిల్స్ లో పోలీసులు గుర్తించారు. బాలికను విచారించగా బెర్నార్డ్ కు చెందిన రిసార్ట్ లో వ్యభిచారం గుట్టు రట్టు అయ్యింది.

మాజీ మిలిటెంట్ నేత అయిన బెర్నార్డ్‌‌కు చెందిన రింపు బగాన్ ఫాం హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడిచేసినట్టు వెస్ట్ గరో హిల్స్ సూపరింటెండెంట్ వివేకానంద్ సింగ్ తెలిపారు. పోలీసులు తనిఖీల్లో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలను రక్షించామని తెలిపారు. బెర్నార్డ్ తో పాటు ఆయన సహచరులు వ్యభిచార గృహం నడుపుతున్న రింపు బగాన్‌లోని అపరిశుభ్రమైన గదులలో వీరిని బంధించినట్టు గుర్తించామని సూపరింటెండెంట్ వెల్లడించారు. రక్షించిన వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO)కి అప్పగించామని తెలిపారు.

బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు 27 వాహనాలు, 8 బైక్‌లు, 400 సీసాల మద్యం, 500 కండోములు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను బట్టి అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు అర్థమవుతోందన్నారు. ఫాం హౌస్‌లో చిన్నచిన్న గదులు 30 ఉన్నట్టు చెప్పారు. అలాగే, 73 మందిని అరెస్ట్ చేశామన్నారు. మైనర్‌పై ఒక వారంలో అనేకసార్లు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.

బాలికను విచారించగా తనను..తన స్నేహితుడిని నిందితులు రింపు బగన్‌కు తీసుకెళ్లారని కోర్టుకు తెలియజేసింది. నిందితులు అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని..తెలిపింది. రింపు బగాన్‌లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ తురా వాసుల నుంచి పలుమార్లు మౌఖిక ఫిర్యాదులు అందాయని..రైడ్ సందర్భంగా యువతీయువకులు దుస్తులు లేకుండా మద్యం తాగుతూ కనిపించారని తెలిపారు. ఆ 68 మందినీ అరెస్ట్ చేసినట్టు వివరించారు. వారితోపాటు మేనేజర్, కేర్‌టేకర్, ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇంత జరుగుతున్నా..ఇదంతా అబద్ధమని.. తనపై వచ్చిన ఆరోపణలను బెర్నార్డ్ కొట్టిపడేశారు. నేను ఎక్కడికీ పారిపోలేదని..పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని..సీఎం కొన్రాడ్ సంగ్మా తనపై కక్ష ఈ కుట్రలో ఇరికించారంటూ ఆరోపించారు. సీఎం ప్రోద్భలంతోనే పోలీసులు ఎటువంటి వారెంట్ లేకుండా దాడులు చేశారని ఆరోపించారు. మైనర్లతో తాను వ్యభిచారం చేయించటంలేదని వారిని నేనే నా స్వంత ఖర్చులతో చదివిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.కాగా..మేఘాలయలో అధికారంలో వున్న మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ (MDA)లో బీజేపీ కూడా భాగస్వామి కావడం గమనించాల్సిన విషయం.