గుంటూరులో కామాంధుడు : బాలికపై అఘాయిత్యం

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 05:52 AM IST
గుంటూరులో కామాంధుడు : బాలికపై అఘాయిత్యం

గుంటూరు : కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని బాలికలపై దారుణాలకు తెగిస్తున్నారు. ఎన్ని చట్టాలు..ఎన్ని హెచ్చరికలు చేసినా కామాంధులు బేఖాతర్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు అత్యధికమౌతున్నాయి. గుంటూరు జిల్లాలో ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేకేత్తించింది. కామాంధుడిని కఠినంగా శిక్షించాలంటూ బాలిక బంధువులు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. 

తూమురుకొటలో ఏడేళ్ల బాలిక జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం బహిర్బూమికి వెళ్లింది. ఇది చూసిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర
రక్తస్రావం కావడంతో బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు..ప్రజా సంఘాలు మాచర్ల బస్టాండు ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి. కామాంధుడిని కఠినగా శిక్షించాలని డిమాండ్  చేస్తున్నాయి. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.