స్మగ్లింగ్ రూట్లు : డ్రిల్లింగ్ మిషన్, కుక్కర్ లో బంగారం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.

  • Published By: veegamteam ,Published On : March 23, 2019 / 03:13 AM IST
స్మగ్లింగ్ రూట్లు : డ్రిల్లింగ్ మిషన్, కుక్కర్ లో బంగారం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరచుగా పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు పట్టుబడుతూ ఉంటుంది. మార్చి 23 శనివారం ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు వ్యక్తుల నుంచి 820 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వేర్వేరు విమానాల్లో వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేశారు. ఒకరు డ్రిల్లింగ్ మిషన్ లో మరొకరు కుక్కర్ లో బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరి నుంచి 820 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీటి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.  
Read Also : ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు‌