Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
ఈ విషయం తెలుసుకున్న నాలుగో భార్య... అంతకుముందు అతడు చేసుకున్న వివాహాలపై కూపీ లాగింది. మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులను ఆశ్రయించింది.
Peddapalli : పెద్దపల్లి జిల్లాలో నిత్యపెళ్లి కొడుకు భాగోతం వెలుగుచూసింది. మహిళలను మోసగించి ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడుతూ… ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికొడుకుపై నాలుగో భార్య కేసు పెట్టింది. మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న మద్దిలేటి ఆలియాస్ మధును అరెస్ట్ చేయాలని కోరుతోంది.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ యువతిని 6నెలల కిందట మద్దిలేటి పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మరో యువతిని పెళ్లిచేసుకోగా వారికి ఒక బాబు జన్మించాడు. అయితే ఆమె కడుపుతో ఉండగానే పుట్టింట్లో వదిలి వెళ్లి మంథనిలో మరో యువతిని పెళ్లాడు.
Three Marriages : చిత్తూరులో నిత్యపెళ్లి కొడుకు.. గుట్టురట్టు చేసిన మూడో భార్య
ఈ విషయం తెలుసుకున్న నాలుగో భార్య… అంతకుముందు అతడు చేసుకున్న వివాహాలపై కూపీ లాగింది. మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే మధుపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.