Student Set On Fire Principal : మార్క్స్ మెమో ఇవ్వడం లేదని.. ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి

మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డారు. మార్కుల మెమో ఇవ్వడం లేదని ఏకంగా ప్రిన్సిపల్ పైనే పెట్రోల్ పోసి నిప్పించాడు. అనంతరం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Student Set On Fire Principal : మార్క్స్ మెమో ఇవ్వడం లేదని.. ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి

PETROL

Student Set On Fire Principal : మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డారు. మార్కుల మెమో ఇవ్వడం లేదని ఏకంగా ప్రిన్సిపల్ పైనే పెట్రోల్ పోసి నిప్పించాడు. అనంతరం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూపాల్ లోని పీఎమ్ ఫార్మసీ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్ తోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి గత ఏడాది బీఫార్మసీ పూర్తి చేశాడు. అయితే మార్క్స్ మెమో ఇవ్వకుండా మహిళా ప్రిన్సిపల్ విద్యార్థిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థి కాలేజీకి వెళ్లాడు. మెమో కావాలని అభ్యర్థిచడంతో ప్రిన్సిపల్, విద్యార్థి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ప్రిన్సిపల్ పై పోసి నిప్పంటించారు. అనంతరం విద్యార్థి కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కానీ అతన్ని పోలీసులు రక్షించారు.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

మహిళా ప్రిన్సిపల్ 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అశ్ తోష్ కూడా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే కొన్ని నెలల క్రితం ఇదే కాలేజీకి చెందిన ఫ్యాకల్టీపై అశ్ తోష్ కత్తితో దాడి చేసి జైలు పాలయ్యాడు. వారం రోజుల క్రితమే బెయిల్ పై విడుదలై ఈ దారుణానికి ఒడిగట్టాడు.