Missing Yoga Teacher : భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నలాయర్

సూసైడ్ కేసు గురించి వస్తే పోలీసులకు మిస్సింగ్ కేసు క్లూ దొరికింది. మధురైకు చెందిన ఓ లాయర్ భార్య దూరమై 10 ఏళ్ల కూతురుతో జీవిస్తున్నాడు. క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటనలో కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. కానీ పోలీసులకు ఓ మిస్సింగ్ కేసు క్లూ దోరికి కేసువిచారణకు దోహదపడింది.

Missing Yoga Teacher : భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నలాయర్

Missing Yoga Teacher

Missing Yoga Teacher : సూసైడ్ కేసు గురించి వస్తే పోలీసులకు మిస్సింగ్ కేసు క్లూ దొరికింది. మధురైకు చెందిన ఓ లాయర్ భార్య దూరమై 10 ఏళ్ల కూతురుతో జీవిస్తున్నాడు. క్షణికావేశంలో చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి తనువు చాలించాడు. ఈ విషాద ఘటనలో కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. కానీ పోలీసులకు ఓ మిస్సింగ్ కేసు క్లూ దోరికి కేసువిచారణకు దోహదపడింది.

మధురైలో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని భార్య యోగా టీచర్. వారికి 10 ఏళ్ల కుమార్తె ఉంది. హరిక్రిష్ణన్ భార్య చిత్రాదేవి ఏప్రిల్ నెల 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. తన కుమార్తె కనిపించటంలేదని చిత్రాదేవి తండ్రి కన్నయ్య మధురై లోని తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదుకాపీని సీఎం సెల్ కు ఫార్వర్డ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతే కాక తన కుమార్తెకు హరికృష్ణకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్పును కూడా పోలీసులకు అందించాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. దర్యాప్తు జరుపుతుండగా చిత్రాదేవి భర్త, లాయర్ హరికృష్ణ మే4నఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఇంట్లోలభించిన సూసైడ్ నోట్ చూసి షాకయ్యారు. సూసైడ్ కేసు గురించి వస్తే వాళ్లకు మిస్సింగ్ కేసు క్లూ దోరికింది.హరికృష్ణ ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ లో హరికృష్ణ భార్య చిత్రాదేవిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

భార్యను చంపి.. తన ఇంటి బాత్రూమ్‌లో సమాధి చేసినట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. క్షణికావేశంలో ఆ పని చేసినప్పటికీ ఆ తర్వాత తాను స్థిమితంగా ఉండలేకపోయానని… చేసిన తప్పుకు బాధపడుతూ.. తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో పేర్కోన్నాడు.