పోలీస్ స్టేషన్‌లో మద్యాన్ని దొంగిలించారు

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 11:28 AM IST
పోలీస్ స్టేషన్‌లో మద్యాన్ని దొంగిలించారు

సాధారణంగా ఇళ్లళ్లో, షాపుల్లో దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగింది. అది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని దొంగలించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మద్యం చోరీ చేశారు. లాక్ డౌన్ సమయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మద్యం షాపు నిర్వహకుడిని పోలీసులు పట్టుకున్నారు. 

షాపులోని మద్యాన్ని స్వాధీనం చేసుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. కాగా పోలీస్ స్టేషన్ లో ఉంచిన మద్యం మాయం అయింది.  గుర్తు తెలియని వ్యక్తులు మద్యాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఇద్దరిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందని తెలిస్తే పరువు పోతుందని పోలీసులు నోరు మెదపడం లేదు. 

Also Read | మద్యం షాపుల ముందు క్యూలో నిల్చున్న మహిళలు