పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్

పొల్లాచి.. ఈ పేరు వింటేనే భయంతో వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అంతుపట్టని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

  • Published By: sreehari ,Published On : April 8, 2019 / 08:06 AM IST
పొల్లాచిలో వరుస హత్యలు.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్

పొల్లాచి.. ఈ పేరు వింటేనే భయంతో వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అంతుపట్టని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

పొల్లాచి.. ఈ పేరు వింటేనే భయంతో వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అంతుపట్టని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. కొన్నిరోజులుగా మానవ మృగాళ్ల చేతిలో అమాయకపు అమ్మాయిలు బలైపోతున్నారు. మిస్టరీని క్రియేట్ చేస్తున్న పొల్లాచి హత్యకేసులు పోలీసులకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. ఆడపిల్లలే వీరి టార్గెట్.. ఇదంతా ఎందుకు.. ఎవరూ చేస్తున్నారో తెలియక పొల్లాచి పరిసర ప్రాంత వాసులు భయంతో ఇళ్లలోనుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. చదువుకునే ఆడ పిల్లలు బయటకు వెళ్తే క్షేమంగా తిరిగివస్తారో లేదోనని భయంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీకి వెళ్లిన అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. 

అత్యాచారం.. గొంతు కోసి హత్య :
జన సంచారం లేని ప్రదేశాల్లో అత్యాచారం చేసి చంపేసి మృతదేహాలను రోడ్డు పక్కన పడేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ మృగాళ్ల పైశాచికత్వానికి ఎందరో యువతులు బలైపోతున్నారు. తాజాగా పొల్లాచి ప్రాంతంలో 20ఏళ్ల యువతి దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. గోమంగళమ్ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన గొంతు కోసి ఓ అమ్మాయి మృతదేహం పడి ఉంది. రంగంలోకి దిగిన కోయంబత్తూరు పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు

కాలేజీకి వెళ్లిన విద్య అదృశ్యం :
పోలీసుల కథనం ప్రకారం.. కోయంబత్తూరులోని డిగ్రీ కాలేజీలో విద్య అనే యువతి రెండో సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం (ఏప్రిల్ 6, 2019)తన ఇంటికి బస్సులో బయల్దేరింది. బస్సులో ఉండగానే తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్టుగా చెప్పింది. అలా చెప్పిన విద్య.. సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వెంటనే తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం పోలీసులకు ఓ అమ్మాయి మృతదేహం పూసారి పట్టి గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్నట్టు సమాచారం అందింది. హుటాహుటినా అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు.. యువతి గొంతు కోసి ఉన్నట్టు గుర్తించారు. స్థానిక వాసులను పోలీసులు ఆరా తీయగా.. అందులో ఒకరు మృతదేహం.. విద్య అనే యువతిగా గుర్తించాడు. యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు విద్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉన్మాది పనేనా? : 
పోస్టుమార్టం అనంతరం యువతి మృతదేహాన్ని విద్య తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విద్యను ఎవరూ హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారించగా.. ఆమెను ఓ కుర్రాడు ప్రేమించమంటూ వెంటపడేవాడని మృతురాల స్నేహితులు చెప్పారు. దీని ఆధారంగా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా.. అతడు ప్రేమించి వెంట పడిన మాట నిజమేనని, ఆమె ప్రేమ అంగీకరించకపోవడంతో.. పట్టించుకోవడం మానేసానని, నాకు ఏపాపం తెలియదని చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. 

4 ప్రత్యేక బృందాలు గాలింపు :
ఇప్పటికే పొల్లాచిలో వరుస యువతుల హత్యల క్రమంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతులను లక్ష్యంగా హత్య చేస్తున్న మానవ మృగాళ్లను పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. కాలేజీ సమీపంలోని సీసీ ఫుటేజీలు, స్నేహితులు, బంధువులను ఆరా తీస్తున్నారు. యువతులపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఏ కొంచెం క్లూ దొరికినా వదిలిపెట్టడం లేదు. నెలక్రితం పొల్లాచి ప్రాంతంలో సెక్స్ రాకెట్ ముఠాకు సంబంధించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
Read Also : వింత కుక్క : ‘తలలో మరో నోరు’