Social Media : ఏపీ సంక్షేమ పధకాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం-కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను నిలిపివేస్తోందని... ప్రభుత్వం విడుదల చేసినట్లుగా నకిలీ పోస్టులు తయారు చేసిన వారిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.
Social Media : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను నిలిపివేస్తోందని… ప్రభుత్వం విడుదల చేసినట్లుగా నకిలీ పోస్టులు తయారు చేసిన వారిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాలను ఆర్ధిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వం ఈ ఏడాది నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్న వారిలో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. కాగా వారిలో ముగ్గురిని సీఐడీ అధికారులు నిన్న విచారించారు. భారత జాతీయ చిహ్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాలను ముద్రించి మరీ ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా నకిలీ పోస్టులు సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది.
జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాల లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే ఈ పోస్టులు సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో మంగళగిరిలోని సీఐడీ విభాగంలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత జాతీయ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాల దుర్వినియోగ నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఆ ఫేక్ పోస్టులను వైరల్ చేసిన 12 సోషల్ మీడియా ఖాతాలను ఇప్పటివరకు గుర్తించారు. అలా గుర్తించిన వారిలో ఐదుగురికి 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు.
Also Read : Massage Centre : మసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి-వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరుచూరి రమ్య(31), బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కోగంటి శ్రీనివాసరావు(46), పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం బుర్రిపాలేనికి చెందిన దాసరి కోటేశ్వరరావు(28)లను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి గం. 8-30 వరకు వరకు ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. వీరిలో పరుచూరి రమ్య తెనాలి నియోజక వర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
విచారణ అనంతరం వారిని విడిచిపెట్టారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు జారీ చేసినవారిలో మరో ఇద్దరు విచారణకు హాజరుకావల్సి ఉంది. కాగా మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేసిన మరికొందరిపై కూడా సీఐడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
A fake message is being circulated and being represented as a Government notification.
Few accounts which started this malicious campaign have been identified. The information has been shared with the Cyber Crime Department.
Official action will be initiated. #FactCheck pic.twitter.com/sOeTnbtIdQ
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 30, 2022