Army Man : రైలులో బాలికపై అత్యాచారం.. ఎవరు చేశారో తెలిస్తే షాక్ !

మహారాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ నేవీ కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలికపై, ఓ ఆర్మీ ఉద్యోగి నడుస్తున్న రైలులో అత్యాచారం చేశాడు. బాలిక ప్రతిఘటించే సరికి ఆమెను కదిలే రైలులోంచి బయటకు విసిరేశాడు. రైలు గమ్య స్ధానం చేరేలోపు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Army Man : రైలులో బాలికపై అత్యాచారం.. ఎవరు చేశారో తెలిస్తే షాక్ !

Maharashtra Train

Army Man : మహారాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ నేవీ కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలికపై, ఓ ఆర్మీ ఉద్యోగి నడుస్తున్న రైలులో అత్యాచారం చేశాడు. బాలిక ప్రతిఘటించే సరికి ఆమెను కదిలే రైలులోంచి బయటకు విసిరేశాడు. రైలు గమ్య స్ధానం చేరేలోపు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గోవా-నిజాముద్దీన్‌ల మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలులో మే 31, సోమవారం రాత్రి ఒక రిటైర్డ్ నేవీ ఉద్యోగి కుటుంబం ప్రయాణిస్తోంది. ఆకుటుంబంలో 8 ఏళ్ల బాలిక కూడా ఉంది. వీరు ప్రయాణిస్తున్న కంపార్ట్ మెంట్‌లోనే ఝాన్సీలో పని చేస్తున్న ఒక ఆర్మీ ఉద్యోగి కూడా ప్రయాణిస్తున్నాడు.

ఆర్మీ ఉద్యోగి కన్ను 8 ఏళ్ల బాలికపై పడింది. అర్ధరాత్రి అంతా గాఢనిద్రలో ఉండగా గం.1-30 సమయంలో ఆర్మీ ఉద్యోగి బాలికను మరుగుదొడ్డిలోకి ఎత్తుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేయబోయాడు. నిద్ర మెలుకువ వచ్చిన బాలిక గట్టిగా అరిచి ప్రతిఘటించింది. అయినా బలవంతంగా ఆమెపై అత్యాచారం చేయబోగా బాలిక గట్టిగా అరిచింది. దీంతో భయపడిని ఆర్మీ ఉద్యోగి బాలికను రైలులోంచి బయటకు విసిరేశాడు.

ఆసమయంలో రైలు సతారా-లోనాండ్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తోంది. రైలు నెమ్మదిగా వెళుతూ ఉండటంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. కదులుతున్న రైలులోంచి కిందపడటంతో బాలిక కాలు విరిగింది. ఆసమయంలో బాలికను అక్కడ చూసిన కొందరు స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

బాలిక చెప్పిన వివరాలతో రైలు వెళుతున్న మార్గంలోని అన్ని రైల్వేస్టేషన్లను అలర్ట్ చేశారు. రైలు జల్గావ్ చేరుకునే సరికి బాధితురాలు చెప్పిన కంపార్ట్ మెంట్‌ను పోలీసులు చుట్టుముట్టారు. రైలులోకి ప్రవేశించి, ఎవరూ కిందకు దిగకుండా కట్టడి చేశారు. బాలిక చెప్పిన ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.