హత్య జరిగిన 12ఏళ్ల తర్వాత రీ-పోస్టుమార్టం : ఆయేషా డీఎన్ఏ సేకరించనున్న సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 02:43 AM IST
హత్య జరిగిన 12ఏళ్ల తర్వాత రీ-పోస్టుమార్టం : ఆయేషా డీఎన్ఏ సేకరించనున్న సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్యాచారం కేసులో.. విచారణను సీబీఐ మరోసారి వేగవంతం చేసింది. మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-పోస్టుమార్టం చేస్తున్నారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో.. కుల పెద్దలు, కుటుంబసభ్యుల పెద్దలు సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆమెని చంపేశారు.

ఈ కేసులో పోలీసులు మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్ఏ నిజంగా ఆమెదేనా అనే సందేహం రావడంతో.. సీబీఐ అధికారులు రీ-పోస్టుమార్టం కోసం కోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రీ-పోస్టుమార్టం నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో శనివారం(డిసెంబర్ 14,2019) రీ-పోస్టుమార్టం చేస్తున్నారు. ఆయేషా మీరా డీఎన్ఏ ని సీబీఐ అధికారులు మరోసారి సేకరించనున్నారు.

ఈ కేసులో న్యాయం కోసం ఆయేషా తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు.. ముందు మత పెద్దలు అంగీకరించలేదు. దీంతో కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది. 2019 జనవరిలో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబును ప్రత్యేకంగా ప్రశ్నించింది. అతని ఇంటికే వెళ్లి కేసుపై గుచ్చి గుచ్చి అడిగింది సీబీఐ టీమ్‌. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా దృష్టి పెట్టింది సీబీఐ టీమ్‌. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల దగ్గర డీఎన్ఏ‌ను కూడా సేకరించారు అధికారులు.

అయేషా మీరా హత్య సమయంలో పనిచేసిన పోలీసులనూ సీబీఐ టీమ్ ప్రశ్నించింది. కానిస్టేబుళ్లు రామారావు, శంకర్‌, రాధాల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. దర్యాప్తు జరిగిన తీరు, సేకరించిన ఆధారాల గురించి వివరాలను తీసుకుంది. కొన్ని కీలక ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపైనా ప్రశ్నించింది.
 
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన ఆనవాళ్లపై సీబీఐ ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులు విజయవాడ కోర్టులో అనుమానాస్పదస్ధితిలో కాలిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది. దీనిపై ఇప్పటికే సీబీఐ.. విజయవాడ కోర్టు సిబ్బందిపై రెండు కేసులు నమోదు చేసింది. 2007 డిసెంబర్‌ 27న ఆయేషా మీరా హత్యకు గురైంది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. హత్య జరిగి 12 సంవత్సరాలు గడుస్తున్నా కేసు మాత్రం కొలిక్కిరాలేదు. 

* కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27న బీ-ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య
* అత్యాచారం చేసి హత్య చేశారని నివేదిక
* కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు
* కేసును విచారించిన పోలీసులు.. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు. 
* 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. సత్యంబాబును దోషిగా తేల్చింది. 
* ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 
* ఆయేషాను బరియల్ గ్రౌండ్‌లో ఖననం చేశారు. 
* తాజాగా రీ పోస్టుమార్టం… డీఎన్ఏ సేకరణ

Also Read : దిశ చట్టం : అత్యాచారం చేస్తే మరణశిక్షే