అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం : కాన్పు సమయంలో శిశువు తల కోసిన వైద్యులు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 11:16 AM IST
అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం : కాన్పు సమయంలో శిశువు తల కోసిన వైద్యులు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది. కాన్పు సమయంలో వైద్యులు శిశువు తల కోసేశారు. శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన చేపట్టారు. 

నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి అనే గర్భిణి ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే కాన్పు సమయంలో వైద్యులు శిశువు తల కోసేశారు. పరిస్థితి సీరియస్ గా ఉందని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కొద్దిసేపటికే శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. 

దీంతో ఆగ్రహించిన గర్భిణి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రసవ సమయంలో డాక్టర్లు శిశువు మొండెం నుంచి తలను వేరుచేశారని ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రసవ సమయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై బాధితురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.