కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కన్నతండ్రి

కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కన్నతండ్రి

కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతండ్రి(40) ఆమెపై కన్నేశాడు. మనసులో ఎప్పటి నుంచో కోరికతో ఉన్న కీచకుడికి ఇటీవల అవకాశం వచ్చింది.

ఆ యువతికి ఇటీవల ఒంట్లో బాగోలేక జలుబు దగ్గుతో ఇబ్బంది పడింది. మంగళవారం (జూన్23)వతేదీ రాత్రి ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రి దగ్గు మందు పేరుతో నిద్ర మాత్రలు ఇచ్చి వేసుకోమని చెప్పాడు. తండ్రి దురుద్దేశం తెలియని యువతి ఆ మాత్రలు వేసుకుని పడుకుంది. వేసుకున్న కొద్ది సేపటికే మైకం కమ్మి విపరీతమైన నిద్రలోకి వెళ్లిపోయి స్పృహ తెలియకుండా పడుకుంది. నిద్రలోకి జారుకున్న కూతురిపై తండ్రిలోని మృగాడు విజృంభించాడు. కూతురు అనే మానవత్వం లేకుండా ఉఛ్చం నీచం వదిలేసి ఆమెపై అత్యాచారానికి ఒడి గట్టాడు.

ఉదయం లేచి చూసే సరికి తన పక్కన తండ్రి పడుకుని ఉండటం తన దుస్తుల వాలకం చూసుకునిషాక్ కు గురైంది. తనపై తండ్రి అత్యాచారం చేశాడని గ్రహించడని ఆమె గ్రహించింది. తండ్రి చేసిన పాపపు పనినితన సవతి తల్లికి చెప్పుకుని భోరుమని విలపించింది. ఆమె ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఏం చేయాలో తెలియని యువతి టాయిలెట్ క్లీనింగ్ కు వాడే ద్రావకాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అదే పరిస్ధితుల్లో స్ధానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి పోలీసులకు తండ్రిపై ఫిర్యాదు  చేసి అక్కడే కుప్ప కూలిపోయింది. పోలీసులు వెంటనే ఆమెను సెయింట్ జాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Read:మ్యారేజి బ్యూరో పేరిట రూ.15 కోట్లు మోసం