Train Mishap In Bihar : పట్టాలు తప్పిన బోగీలు – 6గురు మృతి

  • Published By: madhu ,Published On : February 3, 2019 / 02:18 AM IST
Train Mishap In Bihar : పట్టాలు తప్పిన బోగీలు – 6గురు మృతి

పాట్నా : బీహార్‌లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 9 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఆక్సిడెంట్ హజీపూర్ వద్ద చోటు చేసుకుంది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్‌గా వెళుతోంది. మెహ్‌నార్ దాటిన తరువాత షహదాయి బుజుర్గ్ వద్దకు ఉదయం 03.58 నిమిషాలకు చేరుకుంది. ఇక్కడే ఒక్కసారిగా 9 బోగీలు పట్టాల నుండి కిందకు దిగాయి. 

అందరూ గాఢనిద్రలో ఉండడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. చిమ్మచీకట్లలో ప్రయాణీకుల హాహాకారాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఎస్ 8, ఎస్ 9, బీ3 (ఏసీ), ఒక జనరల్ బోగీతో సహా మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. దీనితో 6గురు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొంతమందికి అక్కడనే వైద్య చికిత్స చేసేందుకు వైద్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కార్యాయలం వెంటనే స్పందించింది. ఘటనపై హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది. సోన్ పూర్ 06158221645, హజీపూర్ 06224272230, బరౌనీ 06279232222 నంబర్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.