ఉగ్రదాడిలో ఆర్ఎస్ఎస్ నాయకుడు మృతి

మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్‌ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2019 / 10:54 AM IST
ఉగ్రదాడిలో ఆర్ఎస్ఎస్ నాయకుడు మృతి

మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్‌ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.

జమ్మూకాశ్మీర్ లోని క్రిస్త్‌వార్‌  లో మంగళవారం (ఏప్రిల్-9,2019) మిలిటెంట్ జరిపిన దాడిలో తీవ్రంగా  గాయపడిన ఆర్ఎస్ఎస్ నేత చంద్రకాంత్ శర్మ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినట్లు బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ శెట్టి తెలిపారు. మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్‌ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.

కిస్త్‌వార్‌లోని హాస్పటల్లో చంద్రకాంత్ శర్మ మెడికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం  గన్‌తో హాస్పటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి చంద్రకాంత్‌ను టార్గెట్ చేసి కాల్పులకు దిగాడు.ఈ సమయంలో దుండగుడిని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డ్ ప్రయత్నించాడు.ఈ సమయంలో దుండగుడి కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు.
Read Also : కరువు వెక్కిరిస్తోంది : చెన్నైవాసుల తాగునీటి కష్టాలు తప్పేనా?