ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దారుణ హత్య…అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడే చంపేశాడు

ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 03:34 AM IST
ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దారుణ హత్య…అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడే చంపేశాడు

ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు.

ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు. భూమి రాసిస్తానని చెప్పి భూపాలపల్లి జిల్లా రాంపూర్ అడువుల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. మద్యం తాగించి దారుణంగా చంపేశాడు. నాలుగు రోజుల తర్వాత హత్య ఉందంతం వెలుగుచూసింది. భూపాలపల్లి అడవుల్లో పోలీసులు మృతదేహం గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని చెబుతున్నారు. 

జనగాం జిల్లా ఓటులకేశిపూర్ కు చెందిన మధుసూదన్ రెడ్డి, పద్మ దంపతులకు పెద్ద కుమారుడు ఆనంద్ రెడ్డి తొలుత జనగామ, వరంగల్ లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఖమ్మంలో ఇంచార్జ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా పని చేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వెళ్లే ఆయన అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.  ఆనందర్ రెడ్డి.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగర గ్రామానికి చెందిన ప్రదీప్ రెడ్డి స్నేహితులు.

ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. ఇద్దరూ ఇసుక వ్యాపారంలో 80 లక్షల నుంచి 90 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. వ్యాపార లావాదేవీల్లో ఆనంద్ రెడ్డి తన వాట కంటే అధికంగా.. ప్రదీప్ రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదనపు డబ్బులు ఇస్తానంటూ ప్రదీప్ రెడ్డి పలుమార్లు వాయిదా వేస్తూ వస్తున్నాడు.

మార్చి 7న హన్మకొండలోని ఓ హోటల్ లో కొంతమంది సమక్షంలో డబ్బుల విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొంత భూమి, మిగతా డబ్బులు భూపాలపల్లిలో ఇస్తానని ప్రదీప్ రెడ్డి నమ్మ బలికినట్లు సమాచారం. అదే రోజు ఉదయం 9 గంటలకు ప్రదీప్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మిగతా కొందరు కారులో భూపాలపల్లికి వెళ్లారు. విందు చేసుకున్నాకే భూమి, డబ్బుల విషయం మాట్లాడుకుందామని ప్రదీప్ రెడ్డి..ఆనంద్ రెడ్డిని రాంపూర్ లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో మార్చి 8న ఆనందర్ రెడ్డి తమ్ముడు శివకుమార్ రెడ్డి హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆనంద్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారాంగా మార్చి 9న అటవీప్రాంతంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అనుమానితులపై దృష్టి పెట్టి విచారణ చేపట్టారు. 

పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి..ఇతర సిబ్బంది నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. సుమారు గంటలపాటు వెతికారు. ఓ ప్రాంతంలో దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించారు. అయితే రాత్రి కావడంతో లేబర్ అధికారి ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని తీసుకరాలేకపోయారు. 
ఉదయం మరోసారి నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ఆనంద్ రెడ్డిని నరికి చంపిన తర్వాత సమీపంలోని పొదల్లో మారణాయుధాలు విసిరివేసినట్లు నిందితులు తెలపడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

See Also | ఆటో డ్రైవర్ల నిజాయితీ : రూ.7.5 లక్షల విలువైన బంగారం యాజమానికి తిరిగి ఇచ్చారు