బాలుడిని.. కొట్టి చంపి..గోతంలో వేసి

  • Published By: madhu ,Published On : September 21, 2020 / 12:11 PM IST
బాలుడిని.. కొట్టి చంపి..గోతంలో వేసి

brutal murder  : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన బాలుడు దావల యశ్వంత్ కుమార్ (8) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని డెడ్ బాడీ గొరిజవోలు, సంక్రాంతి పాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నుదురుపాడుకు చెందిన లక్ష్మి 10 ఏళ్ల క్రితం దావల నాగేశ్వరబాబును కులాంతర మ్యారేజ్ చేసుకుంది. యశ్వంత్‌కుమార్, ఆరేళ్ల జ్యోతి పిల్లలున్నారు. అయితే..ఏడాదిరన్నర క్రితం భర్త నాగేశ్వరబాబు అనారోగ్యంతో చనిపోయాడు. మేనమామ పల్లపు వీరాస్వామి గొరిజవోలుకు తీసుకొచ్చి నివాసం ఏర్పాటు చేశాడు.





2020, సెప్టెంబర్ 18వ తేదీన కొడుకు యశ్వంత్ కుమార్ జన్మదినం కావడంతో కేక్ తీసుకొచ్చేందుకు లక్ష్మి బయటకు వెళ్లింది. ఇంటికి వచ్చే సరికి కుమారుడు యశ్వంత్ కనిపించలేదు. అదేరోజు పోలీసులకు లక్ష్మి ఫిర్యాదు చేసింది.



వీర స్వామి యశ్వంత్ ను కొట్టి చంపేసి గోతంలో వేసి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడని లక్ష్మి కుమార్తె జ్యోతి తల్లికి చెప్పింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. డెడ్ బాడీ కోసం గాలిస్తున్నారు.