జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

  • Published By: chvmurthy ,Published On : December 20, 2019 / 03:55 PM IST
జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ  జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం పోలీసులు  కేసు నమోదు చేశారు.   రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పాల్గోన్న సభలో జేసీ ఈ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జేసీ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు  త్రిలోక్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

త్రిలోక్  ఫిర్యాదు  మేరకు జేసీ పై ఐపీసీ 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదుచేశారు.  జేసీ దివాకర రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చాలా ఫిర్యాదులు అందాయని విచారణ చేపట్టినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు.