హైదరాబాద్లో రోడ్డుపై ఉమ్మినందుకు కేసు నమోదు
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డుపై ఉమ్మినందుకు ఓ యువకుడి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డుపై ఉమ్మినందుకు ఓ యువకుడి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం… దానిని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. తాజాగా.. రోడ్డుపై ఉమ్మినందుకు ఓ యువకుడికి షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. హయత్ నగర్ చెక్ పోస్ట్ సమీపంలో… ఓ వాహనం నుంచి రోడ్డుపై ఉమ్మేస్తూ అబ్దుల్ ముజేద్ అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. దీనిని గుర్తించిన సరూర్నగర్ పోలీసులు ఆ యువకుడిపై సెక్షన్ 188, 269 కింద కేసులు పెట్టారు.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్లు ధరించాలంటూ స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్లు పెట్టుకోవాలంటూ ఆదేశాలు విడుదల చేసింది.
బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లళ్లో తయారు చేసిన మాస్క్లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానాలు విధిస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ చేరింది.(తెలంగాణలో 487కు చేరిన కేసులు…12 మంది మృతి)
తెలంగాణలో ఇవాళ కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది. ఇందులో 430 యాక్టివ్ కేసులు కాగా 45 మంది వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కొల్పోయారు.
ఇక హైదరాబాద్లో అత్యధికంగా 179 కేసులు నమోదు కాగా, నిజామాబాద్లో 49 పాజిటివ్ కేసులు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 23 కేసులు, మెడ్చల్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలో పదిలోపు కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడిచేయడానికి ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆరు ల్యాబ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఎన్ని పాజిటివ్ కేసులు నమోదైనా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
అలాగే వైద్యసిబ్బందికి అవసరమైన ఎన్-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, హ్యాండ్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లను సిద్ధం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను కూడా పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.