కోట్లు స్వాహా : మురళీధర్రావుపై చీటింగ్ కేసు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపించింది. దీనిపై నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా కేంద్ర మంత్రి నిర్మల సంతకాన్ని ఫోర్జరీ చేశారనే అభియోగం కింద మరో కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో నగర బీజేపీలో కలకలం రేపింది.
కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని ఫార్మా ఎక్సిల్ ఛైర్ పర్సన్గా నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానంటూ తన వద్ద నుండి రూ. 2.10 కోట్లు వసూలు చేసి మోసం చేశారని చంపాపేటకు చెందిన తాళ్ల ప్రవర్ణారెడ్డి రంగారెడ్డి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. పదవి గురించి తనను, తన భర్త మహిపాల్ రెడ్డిని నమ్మించారని పిటిషన్లో పేర్కొన్నారు.
రూ. 2.10 కోట్లు తీసుకున్న అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ సంతకంతో ఉన్న అపాయింట్ మెంట్ తమకు అప్పగించారని తెలిపారు. తరువాత కాలయాపన చేశారని, తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా..వారు స్పందించలేదన్నారు. మురళీధర్ రావు నుండి తనకు బెదిరింపులు వచ్చినట్లు, దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలతో సరూర్ నగర్ పోలీసులు మురళీదర్ రావు మరో 8 మందిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.