Chennai Custody Death : చెన్నై లాకప్‌డెత్ కేసులో మృతుడి ఒంటిపై 13 చోట్ల గాయాలు

తమిళనాడులోని చెన్నైలో లాకప్ డెత్‌లో చనిపోయిన విఘ్నేష్ ఒంటిపై 13 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. 

Chennai Custody Death : చెన్నై లాకప్‌డెత్ కేసులో మృతుడి ఒంటిపై 13 చోట్ల గాయాలు

Chennai Custody Death

Chennai Custody Death :  తమిళనాడులోని చెన్నైలో లాకప్ డెత్‌లో చనిపోయిన విఘ్నేష్ ఒంటిపై 13 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది.  విఘ్నేష్ మృతికి కారణాలు ఏంటనేది ఇంకా తేలనప్పటికీ    ప్రస్తుతం ఈ రిపోర్టు కలకలం రేపుతోంది. విఘ్నేష్ తల,కళ్లు,గడ్డం,భుజాలపై గాయాలున్నాయని  పోస్టుమార్టం  నివేదికలో ఉండటంతో పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటననకు సంబంధించిన విడుదలైన సీసీటీవీ పుటేజి ఒకటి వివాదాస్పదంగా మారింది.

గంజాయి అమ్ముతున్నాడనే కేసులో ఏప్రిల్ 18న జీ5 సెక్రటేరియట్ కాలనీ పోలీసులు విఘ్నేష్‌ను అదుపులోకి  తీసుకున్నారు. ఆ క్రమంలో పోలీసులు  అతడ్ని వెంటపడి పట్టుకుని, కొట్టుకుంటూ తీసుకు వెళ్ళిన సీసీటీవీ ఫుటేజి బయట పడింది.  కింద పడిన విఘ్నేష్‌ను పట్టుకునే సమయంలో ఒక కానిస్టేబుల్ లాఠీతో కొడుతున్నట్లు ఆ విజువల్‌లో ఉంది.  ఆ సమయంలో పోలీసులు కిందపడిన ఒక వస్తువును తీసుకున్నారని విఘ్నేష్ బంధువులు ఆరోపించగా … అది విఘ్నేష్ పోలీసుల  పైకి విసిరిన కత్తి అని పోలీసులు వివరణ  ఇచ్చారు.

ఆ మర్నాడు లాకప్‌లో విఘ్నేష్ మరణించాడు.  కేసుపై నోరు మెదపకుండా ఉండేందుకు పోలీసులు తమ కుటుంబానికి  లక్ష రూపాయలు ఇచ్చారని విఘ్నేష్ సోదరుడు  వినోద్ విలేకరుల సమావేశంలో ఆరోపించాడు. ఈ ఘటనపై అధికారులు ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక సబ్-ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, ఈకేసుపై  న్యాయ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి బదిలీ చేసింది.

Also Read : Intermediate Exams : ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు