రక్షణ కల్పించండి : పోలీసులను కోరిన జయరాం భార్య

విజయవాడ : తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ పోలీసులను కోరారు. తన భర్త జయరాంను ఎవరు,

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 02:40 PM IST
రక్షణ కల్పించండి : పోలీసులను కోరిన జయరాం భార్య

విజయవాడ : తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ పోలీసులను కోరారు. తన భర్త జయరాంను ఎవరు,

విజయవాడ : తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ పోలీసులను కోరారు. తన భర్త జయరాంను ఎవరు, ఎందుకు హత్య చేశారో తనకు తెలియదన్నారు. తాను అమెరికాలో ఉంటున్నానని, ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. తనకు ఎవరిపైనా అనుమానం లేదన్నారు. జయరాం హత్య కేసులో నందిగామ పోలీసులు ఆయన భార్య పద్మశ్రీ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఎస్సై, ఇద్దరు పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో పద్మశ్రీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు జయరాం భార్య సమాధానాలు చెప్పిందని జయరాం కంపెనీల లీగల్ అడ్వైజర్ తెలిపారు. జయరాం హత్య తర్వాత ఆమె షాక్‌కు గురైందన్నారు. అమెరికాలో ఉండే పద్మశ్రీకి ఇక్కడి విషయాలపై అవగాహన లేదన్నారు.

 

చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నలుగురు మహిళలతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నారై చిగురుపాటి జయరాం 2019, జనవరి 31వ తేదీ హత్యకు గురయ్యారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్డు పక్కన కారులో ఆయన మృతదేహం కనుగొన్నారు. జయరాంను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తెలిపారు. జయరాం మేనకోడలు శ్రిఖాచౌదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్ రాకేష్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాకేష్‌రెడ్డి జయరాంకు రూ.4.5కోట్లు అప్పుగా ఇచ్చారని, ఆ డబ్బు విషయంలో విభేదాలు వచ్చాయని, అదే హత్యకు కారణం అని పోలీసులు చెబుతున్నారు. జయరాంను హైదరాబాద్‌లోనే మర్డర్ చేసిన నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.

 

పోలీసుల విచారణలో జయరాం మేనకోడలు శ్రిఖాచౌదరి సంచలన విషయాలు చెప్పింది. తన మేమమామ జయరాంతో తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. తన మామయ్య మంచోడు కాదని, లైంగిక వేధింపులకు పాల్పడే వాడని పోలీసులతో చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ రాకేష్‌ను తన మేనమామ జయరామ్‌కు తానే పరిచయం చేశానని తెలిపింది.