చాక్లెట్లు,సమోసాల ఆశ చూపి…చిన్నారిపై అత్యాచారం

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2020 / 12:20 PM IST
చాక్లెట్లు,సమోసాల ఆశ చూపి…చిన్నారిపై అత్యాచారం

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణం జరిగింది. పానీ పూరి,సమోసా,చాకెట్లు ఆశచూపి 8ఏళ్ల బాలికపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని నాగరాజుగా గుర్తించారు.

బీకే గూడ దగ్గర ఉందే దశరం బస్తీలో గుడెసెలు వేసుకుని చిత్తుకాగితాలు ఏరుకుంటూ కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయని,అయితే ఆ గుడిసెల్లోనే నివసించే బాధిత బాలిక కుటుంబం ఉదయాన్నే తమ పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లిన సమయంలో..అదే ఏరియాలో ఉండే నిందితుడు నాగరాజు ఫుల్లుగా మద్యం తాగి…8ఏళ్ల బాలికను చాక్లెట్లు,సమోసాల ఆశ చూపి దగ్గర్లోని ఓ పార్క్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

చిన్నారి ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పిందని,చిన్నారి తల్లిదండ్రులు  కంప్లెయింట్ ఇచ్చారని,దీంతో ఇవాళ నిందితుడు నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.