చిన్నారి హత్య ఘటన : అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు

చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్‌ఆర్‌ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : November 8, 2019 / 10:14 AM IST
చిన్నారి హత్య ఘటన : అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు

చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్‌ఆర్‌ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.

చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారి మృతదేహానికి కాసేపట్లో పోస్ట్‌మార్టం జరగనుంది. నిన్న రాత్రి తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన బాలిక వర్షిణిని కిడ్నాప్‌ చేసిన దుండగులు.. అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్‌ఆర్‌ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు. మరోవైపు వర్షిణి హత్యను నిరసిస్తూ వామపక్షాలు, మహిళా సంఘాల ఆందోళన చేపట్టాయి. మదనపల్లె ఆస్పత్రి ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపాయి. 

చిత్తూరు జిల్లాలో చిన్నారి హత్య కలకలం రేపింది. గురువారం (నవంబర్ 7, 2019) ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం గొంతు కోసి అత్యంత దారుణంగా హత మార్చి శుక్రవారం ఉదయానికి కల్లా పెళ్లి ఇంటి ముందు పడేసి పోయారు. ఈ దారుణ ఘటనలో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. 

కురబలకోట మండలం చేనేత నగర్‌లో బంధువుల ఇంటిలో పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి ఐదు సంవత్సరాల చిన్నారి వర్షిణి వచ్చింది. అలా పెళ్లికి వచ్చిన వర్షిణి ఆడుకుంటుండగా..దుండగులు అపహరించుకుపోయారు. దీంతో చిన్నారి కనిపించకపోవటంతో చుట్టు పక్కల అంతా వెదికారు. అయినా వర్షణి కనిపించపోవటంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

కానీ శుక్రవారం ఉదయానికల్లా ఫంక్షన్ హాల్ దగ్గర వర్షిణి మృతదేహం పడి ఉంది. దీంతో వర్షిణి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వర్షిణి స్వస్థలం బి.కొత్తకోట మండలం గుట్టపాలెం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగారు.