Marriage Cheating : తాళి కట్టే సమయానికి పరారైన పెళ్లి కొడుకు
మరి కొద్ది సేపట్ల తాళి కట్టబోతాడు అనగా ఉన్నట్టుండి పెళ్లి పీటల మీద నుంచి వరుడు పరారైన ఘటన చెన్నైలోని తాంబరంలో చోటు చేసుకుంది.
Marriage Cheating : మరి కొద్ది సేపట్ల తాళి కట్టబోతాడు అనగా ఉన్నట్టుండి పెళ్లి పీటల మీద నుంచి వరుడు పరారైన ఘటన చెన్నైలోని తాంబరంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్ల వారిపల్లెకు చెందిన కేదార్ నాథ్(32) అనే వ్యక్తి 15 ఏళ్ళ క్రితం బతుకు దెరువు కోసం చెన్నై వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో చందన(25) అనే యువతితో పరిచయం అయి అది కాస్త ప్రేమగా మారింది.
దీంతో ఆమె వివాహం చేసుకోమని కోరింది. తన అన్నకు పెళ్ళి అయిన తర్వాత చేసుకుందామని చెప్పాడు. ఈలోగా తన అన్న పెళ్లికి రెండు లక్షలు కావాలి అని చెప్పి చందన కుటుంబ సభ్యుల వద్ద తీసుకున్నాడు. కేదార్ నాథ్ అన్న పెళ్లి అయిపోయింది. ఇక కేదార్, చందన పెళ్లికి ఫిబ్రవరి 21న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వధువు తరుఫు వారు కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు.
Also Read : Rakul Preeth Sing: కండోమ్ టెస్టర్గా రకుల్.. తన పాత్ర ఏమిటంటే?
21 వతారీఖు వచ్చింది. పీటల మీద పెళ్లి జరుగుతోంది. తీరా తాళ్లి కట్టే సమయానికి పెళ్లి పీటల మీద నుంచి కేదార్ నాథ్ పరారయ్యాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. వధువు తరుఫు వారు తాంబరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తరువాత ఓ వారం పాటు తెలిసిన చోటల్లా గాలించినా కేదార్ నాథ్ కనిపించకపోయేసరికి సోమవారం చిత్తూరు జిల్లాలోని కేదార్ నాథ్ సొంతూరు చౌకిళ్ల వారి పల్లెకు వధువు ఆమె బంధువులు వచ్చారు.
Also Read : Summer : వేసవి వచ్చేసింది…జాగ్రత్తలు తప్పనిసరి!
అప్పటికే కేదార్ నాథ్ కుటుంబం సభ్యులు ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. దీంతో చందన కుటుంబ సభ్యులు ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఇంతలో కేదార్ నాథ్ తనను కూడా మోసం చేశాడని మరోక అమ్మాయి నిమ్మన పల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేదార్ నాథ్ ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.