మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసి తగులబెట్టిన కానిస్టేబుల్

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 04:28 AM IST
మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసి తగులబెట్టిన కానిస్టేబుల్

సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్.. మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని తగులబెట్టాడు. రంగారెడ్డి జిల్లా మెయినీపేట మండలం మేకవనం పల్లికి చెందిన మందాకిని అనే మహిళ ఆర్సీపురం పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ప్రకాష్ అనే వ్యక్తి హత్నూర్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. వీరికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రకాష్ వయస్సులో మందాకిని కంటే చాలా పెద్దవాడు. అతనికి ఇంటర్మీడియట్  చదువుతున్న కొడుకు కూడా ఉన్నాడు.

పెళ్లి చేసుకోవాలని ప్రకాష్…మందాకినినీ అడగడంతో ఆమె కోపోద్రిక్తురాలు అయింది. అలాగే వేరే వారితో చనువుగా ఉండడాన్ని ప్రకాష్ తట్టుకోలేకపోయాడు. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి సదాశివపేట మండలం కోనాపూర్ తీసుకెళ్లి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పోలీసులు ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.