భార్య గొంతు నులిమి చంపిన కానిస్టేబుల్

  • Published By: bheemraj ,Published On : June 6, 2020 / 07:28 PM IST
భార్య గొంతు నులిమి చంపిన కానిస్టేబుల్

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని దారుణ జరిగింది. కలకాలం తోడు ఉండాల్సిన భర్తే భార్యన కడతేర్చాడు. భార్యను ఓ కానిస్టేబుల్ హత్య చేశాడు. ఈ ఘటన మామునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పింఛన్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎండీ ఆయుబ్‌ ఖాన్‌, తస్లీమా సుల్తానా భార్యాభర్తలు. 

ఆయుబ్‌ ఖాన్‌(40) పీసీ నెంబర్‌ 60, 2000 బెటాలియన్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య తస్లీమా సుల్తానాను ఆయుబ్‌ ఖాన్‌ గొంతు నులిమి హత్య చేశాడు. కానిస్టేబుల్ ఆయుబ్‌ ఖాన్‌ (జూన్ 6, 2020) విధులకు హాజరు కాలేదు. అయితే డ్యూటీకి ఎందుకు రాలేదని ఆరా తీయగా ఈ ఘటన వెలుగు చూసింది. 

శవం వద్దనే కూర్చుని ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.