డ్రగ్స్ ముఠా అరెస్టు
హైదరాబాద్: నగరంలో ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల సంబరాల్లో మునిగితేలే వేళ నగర పోలీసులు డ్రగ్స్ రాకెట్ ను అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లోడ్రగ్స్ వినియోగిస్తారనే సమాచారంతో నిఘా పెంచిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జోసెఫ్ అలమేధ,శంకర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరూ నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కోనుగోలుచేసి ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్,జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో మ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రాము కొకైన్ 3వేలకు కొని , దానిని 6నుంచి 7 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిసింది.