తెలంగాణలో చోరీ-ఆంధ్రాలో అరెస్ట్-రూ.40 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం

తెలంగాణలో చోరీ-ఆంధ్రాలో అరెస్ట్-రూ.40 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం

cops held two Rajasthan thieves in andhra, telangana check post : తెలంగాణాలో దొంగతనం చేసి ఆంధ్రామీదుగా పారిపోవాలని చూసిన ఇద్దరు దొంగలు ఆంధ్రా పోలీసుల చేతికి చిక్కారు. తెలంగాణ సరిహద్దులో ఆంధ్రాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఒక ఆటోలో్ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా అందులో రూ. 35,61 650/- రూపాయల నగదు మరియు 5,17 350 విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో కలిపి 40,79,000/-లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాజస్ధాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిబ్రవరి 26వ తేదీ వైరా పోలీసు స్టేషన్  పరిధిలోని ద్వారకా నగర్ లో దొంగతనం చేశారు. ఆ నగదు,బంగారం అంతా తీసుకుని ఆదివారం ఉదయం పరారవుతుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు.