భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ – ఆస్పత్రిలో భార్య,భర్త అనుమానాస్పద మృతి

భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ – ఆస్పత్రిలో భార్య,భర్త అనుమానాస్పద మృతి

భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ ఆస్పత్రిలో భార్య,భర్త అనుమానాస్పద మృతి

couple end life, in hospital, police received death note aside bodies,Hyderabad : హైదరాబాద్ రహమత్ నగర్ లో నివసించే సుబ్బారావు కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతనిభార్య సాయిలక్ష్మి(42) గృహిణి. వీరికి ఒక కూతురు శివాణి. కూతురుకు పెళ్ళి చేసేశారు ఆమె కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. చిన్నకుటుంబం చింతలేనికుటుంబం అనేలా ఉన్నవీరి కుటుంబాన్ని విధి కాటేసింది.

ఇటీవల సుబ్బారావు భార్య సాయిలక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆమెను రాజ్ భవన్ క్వార్టర్స్ సమీపంలోని ఒక ప్రైవేట ఆస్పత్రిలో చేర్పిచి చికిత్స అందిస్తున్నాడు సుబ్బారావు. ఆస్పత్రిలో ఆమెకు సహాయంగా అతనే ఉంటున్నాడు. ఈనెల 11 వ తేదీ ఆస్పత్రి సిబ్బంది వారి రూమ్ లోకి వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్ధితిలో ఉన్నారు. సిబ్బంది వెంటనే సుబ్బారావు కుమార్తె శివాణి కి సమాచారం అందించి సుబ్బారావు దంపతులుకు చికిత్స అందించారు.

శివాణి ఉదయం గం. 4-30లకు ఆస్పత్రికి చేరుకునే సరికి తల్లి సాయిలక్ష్మి మరణించగా…తండ్రి సుబ్బారావు ఆపస్మారక స్ధితిలోనే ఉన్నాడు. సుబ్బారావును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స్ పొందూతూ శుక్రవారంసాయంత్రం మరణించాడు. ఆస్పత్రిలో వారి బెడ్ పక్కన సుసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులో నా చావుకు ఎవ్వరూ కారణం కాదు, ఆస్పత్రి సిబ్బందికి తమ చావుకు ఎటువంటి సంబంధం లేదు. మానసికవ్యధతో చనిపోతున్నాను. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే తమ దహనసంస్కారావు చేయాలని రాసి ఉంది.

కాగా…భార్య అనారోగ్య సమస్యకు భయపడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్య గొంతునులిమి చంపేసి అనంతరం సుబ్బారావు ఆత్మ హత్య చేసుకున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 174, 309 ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.