Covid-19 : ఆస్పత్రి నుంచి కోవిడ్ ఖైదీ పరార్

కోవిడ్ ఆస్పత్రుల్లో సరైనసౌకర్యాలు లేక కోన్ని చోట్ల పేషెంట్లు పారిపోయిన వార్తలు చూశాం. కోవిడ్ పేషెంట్లు సరైన అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకు తిరిగిన ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అసోంలో కోవిడ్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నఖైదీ పరారరవటం కలకలం రేపింది.

Covid-19 : ఆస్పత్రి నుంచి కోవిడ్ ఖైదీ పరార్

Covid-19 : కోవిడ్ ఆస్పత్రుల్లో సరైనసౌకర్యాలు లేక కోన్ని చోట్ల పేషెంట్లు పారిపోయిన వార్తలు చూశాం. కోవిడ్ పేషెంట్లు సరైన అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకు తిరిగిన ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అసోంలో కోవిడ్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నఖైదీ పరారరవటం కలకలం రేపింది.

అస్సాంలోని కర్బీ జిల్లాలోని ఓ రిమాండ్ ఖైదీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గురువారం మధ్యాహ్నం అతడ్ని డిపు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు కోవిడ్ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందించటం ప్రారంభించారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి కోవిడ్ వార్డులో ఆఖైదీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన డాక్టర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. జూన్ 12 నిందితుడు పెద్ద ఎత్తున డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతను జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పారిపోయినఖైదీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు.