టిక్..టాక్ ఆంటీ….. పలువురితో అక్రమ సంబంధం ఎంతవరకు వెళ్లిందంటే?

  • Published By: chvmurthy ,Published On : April 5, 2020 / 08:37 AM IST
టిక్..టాక్ ఆంటీ….. పలువురితో అక్రమ సంబంధం ఎంతవరకు వెళ్లిందంటే?

ప్రేమించి పెళ్లి చేసుకుంది…మొగుడు కొనిచ్చిన కొత్త ఫోన్ తో టిక్ టాక్ వీడియోలు చేసింది. దీంతో విపరీతంగా అభిమానులు పెరిగారు. వారిలో కొందరితో పరిచయాలు పెంచుకుని… వివాహేతర సంబంధం పెట్టుకుంది.  వ్యవహారం బయటపడటంతో భర్త చేతిలో హతమై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.
 

తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియార్  కు చెందిన కారు డ్రైవర్  కుమారవేల్ , నైవేలీ దిడీర్ కుప్పం కు చెందిన రాజేశ్వరిని ప్రేమించాడు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి వారి అనుమతితోనే  వివాహం చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి 7 ఏళ్ళు, 3 ఏళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. (సహజీవనం పేరుతో సుఖాలనుభవించాడు….పెళ్ళనే సరికి పరార్)

కుమారవేల్ కారు డ్రైవర్ అవటంతో ఎక్కువ సమయం బాడుగ కోసం బయట తిరుగుతూ ఉండేవాడు. దీంతో రాజేశ్వరి ఒక్కతే పిల్లలను పెట్టుకుని ఇంట్లో కాలక్షేపం చేసేది.  భర్త కుమార్ ఇంట్లో ఉన్న సమయంలో అతని స్మార్ట్ ఫోన్ తీసుకుని దానితో కాలం గడప సాగింది.  కొత్తల్లో  ఈవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కుమార్.  కొద్దికాలం క్రితం ఎక్కువగా నైట్ సర్వీసులు చేసిన కుమార్ పగటి పూట ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో అతడి స్మార్ట్ ఫోన్ తో ఎక్కువగా కాలక్షేపం చేస్తోంది రాజేశ్వరి. 

cuddlore murder

భార్య స్మార్ట్ ఫోన్ ఎక్కువగా  వాడటం నచ్చని కుమార్ భార్యను మందలించాడు. ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ తో గడపకు… లేని పోని పిచ్చి, పిచ్చి, ఆలోచనలు వస్తాయని  హెచ్చరించాడు.  వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండమని సూచించాడు. అయినా ఆమె వినకుండా తనకు  స్మార్ట్ ఫోన్ కొనివ్వమని భర్తను కోరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కదా..కొత్త స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు కుమార్ రాజేశ్వరికి.  
 

ఇప్పుడు పూర్తి స్ధాయిలో తన చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి రాజేశ్వరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంకేముంది సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో ఎంట్రీ ఇచ్చింది.  క్రమేపి రాజేశ్వరి టిక్ టాక్ వీడియోలకు అభిమానులు పెరిగారు. భర్త డ్యూటీ పనిమీద బయటకు వెళ్లటం ఆలస్యం ఆమె ఇంక టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేసేది. (భర్త ఆత్మహత్య….ఒంటరి తనంతో బావతో అక్రమ సంబంధం...)

టిక్ టాక్ లో పరిచయం అయిన యువకులతో వీడియోలు చేస్తూ వాటిని పోస్ట్ చేసేది. కొన్నాళ్లకు సాటి డ్రైవర్లు రాజేశ్వరి టిక్ టాక్ వీడియోలు చూపిస్తూ నీ భార్య కదూ అని కుమార్ ని అడగటం మొదలెట్టారు. టిక్ టాక్ లో వస్తున్న వీడియోలు చూసి సాటి డ్రైవర్లు అడుగుతున్న ప్రశ్నలకు కుమార్ సమాధానం చెప్పలేక షాక్ కు గురయ్యాడు. 
 

టిక్ టాక్ పిచ్చిలో పడి భార్య రాజేశ్వరి మాట వినటం లేదని అర్ధం చేసుకున్న కుమార్… వాతావరణం మారితే అయినా మార్పు వస్తుందేమో నని.. ప్రస్తుతం ఉన్న ఏరియా నుంచి ఇల్లు అద్దెకు వేరే చోటకు మరాడు.  అక్కడికి  ఇల్లు మారిన తర్వాత రాజేశ్వరికి టిక్ టాక్ వీడియోలతో అదే ప్రాంతంలో ఉన్న మురుగన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త క్రమేపి వివాహేతర సంబంధానికి దారి తీసింది. మరో వైపు టిక్ టాక్ వీడియోలతో పెరిగిన అభిమానుల్లో కొందరితో ఆమె గంటల తరబడి ఫోన్ లో మాట్లాడేది. 

cuddlore murder 3

ఈ క్రమంలో  రాత్రి పూట డ్యూటీకి వెళ్లిన కుమార్  ఎన్నిసార్లు ఫోన్ చేసినా  రాజేశ్వరి ఫోన్ ఎంగేజ్  రావటంతో కుమార్ విసిగిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఎవరితో మట్లాడుతున్నావ్, ఎప్పుడూ చూసినా మొబైల్ ఎంగేజ్ వస్తోందని భార్యని ప్రశ్నించాడు. భర్త ఎప్పుడు అడిగినా ఏదో ఒక కధ చెప్పి అప్పటికి తప్పించుకునేది రాజేశ్వరి.
 

ఒక రోజు రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన కుమార్ షాక్ కు గురయ్యాడు. భార్య రాజేశ్వరి వేరే వ్యక్తితో నగ్నంగా రాసలీలలు సాగిస్తూ  బెడ్ రూం లో కనపడింది.  భార్యను ఆ పరిస్ధితుల్లో చూసిన కుమార్ లో కోపం కట్టలు  తెంచుకుంది. కోపంతో ఊగి పోయాడు. అందుబాటులో ఉన్న కారు జాకీ తీసుకుని వారిపై దాడి చేశాడు.

దాడిలో రాజేశ్వరితో పాటు ఉన్న వ్యక్తి తప్పించుకుపోగా, రాజేశ్వరి తలకు తీవ్రగాయం అయ్యింది. కుమార్ వేల్ కొట్టిన దెబ్బలకు తీవ్ర రక్తస్రావం అయిన రాజేశ్వరి అక్కడి కక్కడే ప్రాణాలు విడిచింది. రాజేశ్వరి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

తన భార్య టిక్ టాక్ మోజులో పడి తన మాట వినటం లేదని… ఆమె సుమారు 300 టిక్ టాక్ వీడియోలు చేసిందని చెప్పాడు. వీడియోల ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని… అది తట్టుకోలేక హత్య చేసినట్లు కుమార్ వేల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. (అన్న భార్యతో తమ్ముడి రాసలీలలు…..ఉద్యోగం కోసం విదేశాలకు అన్న….)