ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 05:27 PM IST
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నల్గొండ పట్టణ శివారులోని మారుతీరావుకి సంబంధించిన ఓ పాడుబడిన షెడ్ లో మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. రక్తపు మడుగులో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని డెడ్ బాడీ ఉంది. షెడ్డు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు షెడ్డుని పరిశీలించారు. అక్కడ మృతదేహం లభ్యమైంది. వారం రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. గుర్తుపట్టకుండా మృతదేహంపై దుండగులు ఆయిల్ పోసి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. నల్గొండ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించింది.

మృతదేహం ఎవరిది?
ఈ ఘటనతో మిర్యాలగూడలో మరోసారి కలకలం మొదలైంది. మారుతీరావుకి చెందిన షెడ్ లో డెడ్ బాడీ లభించడం మరింత చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? మారుతీరావు షెడ్డులోకి ఎలా వచ్చింది? షెడ్డులోనే మర్డర్ జరిగిందా? లేక ఎక్కడైనా చంపి.. షెడ్డులో పడేశారా? ఇప్పుడీ ప్రశ్నలు మిస్టరీగా మారాయి. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు.

ప్రణయ్ ని చంపించిన మారుతీరావు:
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. తన కుతూరు అమృత.. దళితుడైన ప్రణయ్ ని కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మారుతీరావు.. ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరి ఈ మర్డర్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ కేసులో ముగ్గురు నిందితుల(మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, కరీం) పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటున్న నిందితులు ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం వారు బయటే ఉన్నారు. ఈ క్రమంలో మారుతీరావు షెడ్‌లో మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. మారుతీరావు మరో వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది. మారుతీరావుకి, ఈ డెడ్ బాడీకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ప్రణయ్ కుటుంబసభ్యులతో ఉంటున్న అమృత:
మారుతీరావు కూతురు అమృత ప్రస్తుతం ప్రణయ్‌ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటోంది. నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల అమృత తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. తాను పీడీ చట్టం కింద పెట్టిన కేసును తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చి కుట్రదారులకు బెయిల్ మంజూరు చేయడం బాధకరమని తెలిపింది. నా బాధను అర్థం చేసుకోలేదంది. దేవుడు తనవైపే ఉన్నాడని, తాను సరైన మార్గంలో వెళ్తున్నాని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది. తనకు పుట్టిన బిడ్డలో భర్త ప్రణయ్‌ను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది అమృత.