కుళ్లిపోయిన స్థితిలో…ఓ ఇంటిలో 5మృతదేహాలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2020 / 10:31 AM IST
కుళ్లిపోయిన స్థితిలో…ఓ ఇంటిలో 5మృతదేహాలు

ఢిల్లీలో ఓ ఇంటిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 5మృతదేహాలను బుధవారం(ఫిబ్రవరి-12,2020) పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఓ జంట తమ ముగ్గురుపిల్లలను చంపి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని భజన్ పురా ఏరియాలో శంభు(43) అనే వ్యక్తి భార్య సునీత(38),ముగ్గురు పిల్లల(ఇద్దరు కొడుకులు,ఒక కూతురు)తో కలిసి జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే శంభు కుటుంబం భజన్ పురా ఏరియాకు వచ్చింది. శంభు ఈ-రిక్షా డ్రైవర్ గా పనిచేస్తేూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు.

అయితే ఇవాళ ఉదయం 11గంటల సమయంలో ఢిల్లీ పోలీసులకు ఓ కాల్ వచ్చింది. శుంభు నివసించే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు ఆ ఫోన్ కాల్ లో స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకుని తలుపులు పగులకొట్టి చూడగా,కుళ్లిపోతున్న స్థితిలో ఐదుగురు మృతదేహాలు వారికి కన్పించాయి.

అయితే నాలుగు,ఐదు రోజుల క్రితం శుంభు కుటుంబం తమ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. శుంభు ఇంట్లో ఎవ్వరూ దొంగతనానికి పాల్పడినట్లుగానీ,బలవంతంగా దూరినట్లుగానీ ఎలాంటి సంతకేతాలు కనిపించడం లేదని,ఇది ఆత్మహత్యగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.