Delhi woman: చనిపోయిన తండ్రిని బతికించేందుకు మహిళ దారుణం.. చిన్నారిని ఎత్తుకెళ్లి నరబలి ఇచ్చేందుకు యత్నం

మూఢ నమ్మకం మత్తులో ఒక మహిళ దారుణానికి సిద్ధపడింది. చనిపోయిన తన తండ్రిని తిరిగి బతికించేందుకు చిన్నారిని బలివ్వాలనుకుంది. దీనికోసం రెండు నెలల వయసున్న చిన్నారినిక కిడ్నాప్ చేసింది.

Delhi woman: చనిపోయిన తండ్రిని బతికించేందుకు మహిళ దారుణం.. చిన్నారిని ఎత్తుకెళ్లి నరబలి ఇచ్చేందుకు యత్నం

Delhi woman: ఢిల్లీలో ఒక మహిళ దారుణానికి ఒడిగట్టింది. చనిపోయిన తండ్రిని బతికించేందుకు రెండు నెలల చిన్నారిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం చిన్నారిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

PM Modi-Pawan kalyan Letter : ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ .. ఏఏ అంశాలున్నాయంటే..

పోలీసుల సమాచారం ప్రకారం.. గత గురువారం ఢిల్లీలోని గర్హి ప్రాంతానికి చెందిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చిన్నారి, పాప తల్లిదండ్రులు కలిసి ఉండగా ఒక మహిళ అక్కడికి వచ్చి పరిచయం చేసుకుంది. తాను ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చినట్లు, చిన్నారుల పెంపకం గురించి వివరించి చెప్పింది. అదే రోజు ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిపోయింది. దీంతో పాప తల్లిదండ్రులు వెంటనే పోలీస్ట స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను శ్వేత (25)గా గుర్తించారు.

Viral Video: చెల్లికి అన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

కిడ్నాప్ ఎందుకు చేసింది అనే విషయాలు విచారించగా పోలీసులు షాకింగ్‌కు గురయ్యే నిజం తెలిసింది. శ్వేతకు మూఢ విశ్వాసాలు ఎక్కువ. చిన్నారిని బలి ఇస్తే చనిపోయిన తన తండ్రి బతుకుతాడని నమ్మింది. దీంతో తండ్రిని తిరిగి బతికించేందుకు పాపను బలివ్వాలనుకుంది. ఇందుకోసమే రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం పోలీసులు శ్వేతను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.