వాళ్లని వదలద్దు….ఉన్నావ్ బాధితురాలి చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2019 / 10:31 AM IST
వాళ్లని వదలద్దు….ఉన్నావ్ బాధితురాలి చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుకుల్లో హాస్పిటల్ బెడ్ పై ఆ యువతి నన్ను బతికించండి అంటూ డాక్టర్లను వేడుకున్న తీరు హృదయాలను కలిచివేస్తుంది.

బాధిత యువతి ట్రీట్మెంట్ పొందిన సఫ్దార్‌గంజ్ హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ సునీల్ గుప్తా మాట్లాడుతూ…గురువారం రాత్రి 8గంటలకు లక్నో నుంచి బాధితురాలని హాస్పిటల్ కు తీసుకువచ్చినప్పుడు తను సృహలోనే ఉంది.చాలా చిన్నగా మాట్లడుతున్నప్పకీ,నిందితులను ఊరికే వదిలిపెట్టవద్దని మాతో చెప్పింది. నేను బతుకుతానా అని డాక్టర్లను అడిగింది. దయచేసి నన్ను బతికించండి అని డాక్టర్లను కోరినట్లు గుప్తా తెలిపారు. బాధిత యువతి మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించిన అనంతరం ఆమె సోదరుడు మాట్లాడుతూ…నిందితులు ఐదుగురు మరణశిక్షకు అర్హులని,నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తాను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లుగా యూపీ పోలీసులు కూడా నిందితులను ఎన్ కౌంటర్ చేయాలన్నారు.

కొన్ని నెలల క్రితం..ఉన్నావ్‌లో నివాసం ఉండే యువతిపై అత్యాచారం జరిగింది. తర్వాత బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే నిందితుడు బెయిల్‌ పై విడుదలయ్యాడు. ఫిర్యాదు చేసిన యువతిపై కక్ష పెంచుకున్నాడు.ఈ సమయంలో బుదవారం స్థానిక కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో బీహార్ పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వచ్చే సింధుపూర్ అనే గ్రామంలో యువతిపై ఒక్కసారిగా నిందితుడు..అతని నలుగురు స్నేహితులు దాడికి పాల్పడ్డారు. యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. 95శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి యువతి కన్నుమూసింది.