రాజ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం
Major Fire near Odisha Raj Bhavan ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్భవన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. పెట్రోల్ బంకులోని ఇంధనం నిల్వ ఉన్న రెండు ట్యాంకుల్లో.. ఒకటి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి చెప్పారు.
ఈ పేలుడు ఘటనలో 8 మందికి గాయాలయ్యాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ట్మీట్మెంట్ కోసం క్షతగాత్రులను కటక్ లోని SCB మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. కాగా, క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.