రాజ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2020 / 03:37 PM IST
రాజ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం

Major Fire near Odisha Raj Bhavan  ఒడిశా రాజధాని భువనేశ్వర్ ​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్​భవన్​ సమీపంలోని ఓ పెట్రోల్​ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.




భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. పెట్రోల్​ బంకులోని ఇంధనం నిల్వ ఉన్న రెండు ట్యాంకుల్లో.. ఒకటి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి చెప్పారు.

ఈ పేలుడు ఘటనలో 8 మందికి గాయాలయ్యాయని ఓ పోలీస్​ అధికారి తెలిపారు. ట్మీట్మెంట్ కోసం క్షతగాత్రులను కటక్ లోని SCB మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. కాగా, క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.