Extra Marital Affair : పక్కింటి అతడి భార్యతో వెళ్లిపోయిన కొడుకు… తల్లి ఆత్మహత్య
ఒక కొడుకు వివాహేతర సంబంధం తల్లి ప్రాణాలు తీసింది. కొడుక్కి మేనకోడలితో వివాహాం జరిపించగా... పెళ్లై 2 నెలలు తిరక్క ముందే కొడుకు పక్కింటోడి పెళ్లాంతో లేచి పోయాడు. మనస్తాపానికి గురైన ఆ
Extra Marital Affair : ఒక కొడుకు వివాహేతర సంబంధం తల్లి ప్రాణాలు తీసింది. కొడుక్కి మేనకోడలితో వివాహాం జరిపించగా… పెళ్లై 2 నెలలు తిరక్క ముందే కొడుకు పక్కింటోడి పెళ్లాంతో లేచి పోయాడు. మనస్తాపానికి గురైన ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
బంగ్లాదేశ్ లోని సిరాజ్ గంజ్ లోని తారాష్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిన్నబరి గ్రామంలో నివసించే ఫిరోజ్ ఖాతూన్(42) అనే మహిళ తన కుమారుడు ఫిరోజ్ అహ్మద్ కు తన అన్న కూతురుతో రెండు నెలల క్రితం వివాహం చేసింది. కొత్త దంపతులు హాయిగా సంసారం చేసుకుంటున్నారు.
వారం రోజుల క్రితం ఖాతూన్ కుమారుడు అహ్మద్ పక్కింటి వ్యక్తి భార్యను తీసుకుని పారిపోయాడు. దీంతో పక్కింటి వ్యక్తి ఖాతూన్ కుటుంబాన్ని దుర్భాషలాడాడు. పక్కింటి వ్యక్తి….అహ్మద్ తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడని స్ధానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి వారం రోజులైంది.
Also Read : Sexual Abuse On Dog : కుక్కపై లైంగిక దాడికి పాల్పడిన వృధ్దుడు
పారిపోయిన జంట ఆచూకి లభించలేదు. ఈలోగా చుట్టుపక్కల వారు ఖాతూన్ ను విమర్శించసాగారు. ఇతరుల విమర్శలు తట్టుకోలేని ఖాతూన్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని నాటోర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
కానీ ఆమె మార్గమధ్యంలోనే కన్ను మూసింది. కేసు నమోదు చేసుకున్న తారాష్ పోలీసు స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరాజ్ గంజ్ బంగమాత ఫజిలతున్నేసా ముజీబ్ ఆస్పత్రికి తరలించారు.