Acid Attack : మండపంలో పెళ్లికొడుకుపై యాసిడ్ దాడి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం

Acid Attack : పెళ్లి మండపంలో కరెంట్ పోయింది. అంధకారం నెలకొంది. సడెన్ గా ఒక్కసారిగా కలకలం రేగింది. వరుడిపై యాసిడ్ దాడి జరిగింది.

Acid Attack : మండపంలో పెళ్లికొడుకుపై యాసిడ్ దాడి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం

Acid Attack(Photo : Google)

Acid Attack : ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలోని భన్ పురిలో ఈ నెల 19న పెళ్లి మండపంలో వరుడిపై యాసిడ్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా విచారణ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం వెలుగుచూసింది. ఆ దాడి చేసింది ఎవరో తెలుసుకుని పెళ్లికొడుకుతో పాటు పోలీసులూ నివ్వెరపోయారు. పెళ్లి మండపంలో వరుడిపై యాసిడ్ దాడి చేసింది అతడి ప్రియురాలే అని పోలీసులు గుర్తించారు.

తనను ప్రేమించి మోసం చేసి, మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో యువతే(22) యాసిడ్ దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడి ప్రేమ వ్యవహారం కోణంలో దర్యాఫ్తు చేశారు. అతడి ప్రియురాలిని విచారించారు. యాసిడ్ దాడి చేసింది తానేనని ఆమె పోలీసుల విచారణలో ఒప్పుకుంది. మగవాడి వేషంలో వచ్చి దాడి చేసినట్లు తెలిపింది.(Acid Attack)

Also Read..Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్

ఈ నెల 19న రాత్రి వేళ చోటే అమాబల్ గ్రామంలో దామ్రుదర్ భాగేల్ కు (25) యువతితో(19) పెళ్లి జరుగుతోంది. ఇంతలో పెళ్లి వేదికలో కరెంట్ పోయింది. అక్కడ అంతా అంధకారం నెలకొంది. సడెన్ గా ఒక్కసారిగా కలకలం రేగింది. వరుడిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో వరుడితో పాటు వధువు, పెళ్లి మండపంలో ఉన్న 10మంది గాయపడ్డారు. వారందరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. కరెంట్ పోయిన సమయంలో దాడి జరగడంతో దాడి చేసింది ఎవరో గుర్తించలేకపోయారు. ఈ దాడి చేసింది ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనేది మిస్టరీగా మారింది.

వరుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఆ తర్వాత పెళ్లికొడుక్కి కానీ, పెళ్లి కూతురికి కానీ ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు భాగేల్.. తన ప్రియురాలి గురించి పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. అంతే, ఆ యువతి నిజం కక్కేసింది. వరుడిపై యాసిడ్ దాడి చేసింది తానేనని ఒప్పుకుంది.

Also Read..Kenya : ఘోరం.. జీసస్‌ని కలుసుకోవాలని 47మంది ఆత్మహత్య, చర్చి పాస్టర్ చెప్పాడని..

వరుడు భాగేల్ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడంది. తీరా, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుని తనను మోసం చేయడంతో ఈ దాడికి పాల్పడినట్లు చెప్పింది. తాను పని చేసే పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ను క్లీన్ చేసేందుకు వాడే యాసిడ్ ను దొంగిలించి దాడికి వాడినట్లు తెలిపింది. అలాగే తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మగవాడి డ్రెస్ ధరించి వచ్చానంది. పెళ్లి మండపంలో వరుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది అతడి ప్రియురాలే అని తెలిసి అంతా షాక్ అయ్యారు.