లంకలో మరో బాంబు పేలుడు

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 04:59 AM IST
లంకలో మరో బాంబు పేలుడు

బాంబుల మోతతో శ్రీలంక దద్దరిల్లిపోతుంది.లంకలో బాంబుల మోత కొనసాగుతోంది. ఇవాళ(ఏప్రిల్-25,2019) ఉదయం రాజధాని కొలంబోకి 40కిలోమీటర్ల దూరంలోని పుగోడా టౌన్ లోని మెజిస్ట్రేట్స్ కోర్టు వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో బాస్ట్ జరిగినట్లు స్థానికులు,పోలీసులు తెలిపారు.ఈ బ్లాస్ లో ఎవ్వరూ గాయపడలేదని స్థానికులు తెలిపారు.పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని పోలీస్ ప్రతినిధి రువాణ్ గుణశేఖర తెలిపారు.ఈ రోజు పేలిన బాంబుతో కలిపి ఆదివారం నుంచి ఐసిస్ ఉగ్రసంస్థ జరిపిన 9 బాంబ్ బ్లాస్టలు శ్రీలంకలో నరమేథం సృష్టించారు. ఇప్పటివరకు 359మంది బాంబ్ పేలుళ్ల కారణంగా చనిపోగా 500మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.