Extra marital affair : మరదలితో వివాహేతర సంబంధం.. పెద్దలు ఒప్పుకోకపోవటంతో బలవన్మరణం

పెళ్లైన రెండేళ్ళకు మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి... తమ బంధాన్ని పెద్దలు అంగీకరించరని తెలిసి ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.

Extra marital affair : మరదలితో వివాహేతర సంబంధం.. పెద్దలు ఒప్పుకోకపోవటంతో బలవన్మరణం

Extra Marital Affair

Extra marital affair : married man, his girlfriend consume poison in UP’s Moradabad : పెళ్లైన రెండేళ్ళకు మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి… తమ బంధాన్ని పెద్దలు అంగీకరించరని తెలిసి ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఉత్తర ప్రదేశ్ లోని మొరాబాదాబాద్ జిల్లా ధర్కానగ్లా  గ్రామలో నివసించే రాజ్ కుమార్ కు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది.  గతేడాది పనిమీద సంబల్ లో నివసించే తన మామ గారింటికి వెళ్లాడు.

అక్కడ ఉన్న సమయంలో పెళ్లి కాని భార్య చెల్లెలితో కాస్త చనువుగా ఉండటం మొదలెట్టాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.  కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఇంట్లో పెద్దలు తమ బంధాన్ని ఒప్పుకోరని తెలుసుకున్నారు. విడిపోయి దూరంగా ఉండలేమనుకున్నారు. కలిసి జీవించే పరిస్ధితి లేదు. మధన పడిన ప్రేమికులు ఇద్దరూ బలవన్మరణాని సిధ్ధమయ్యారు.

ఏప్రిల్ 6వ తేదీ,మంగళవారం, రాత్రి ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయారు. వెంటనే మహిళ కుటుంబ సభ్యులు…తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని సంబల్ పోలీసు స్టేషన్ లో రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ప్రేమ జంట గురువారం  గ్రామానికి తిరిగి వచ్చింది.

రాత్రి ఇద్దరూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో వారు ఉన్న ప్రాంతాన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన బంధువులు అక్కడకు చేరుకున్నారు.

ఇద్దరినీ సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజ్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 366(మహిళను కిడ్నాప్ చేయటం, పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.