Extra marital affair : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కూతుర్ని చంపిన కన్నతల్లి

అక్రమ సంబంధాల మోజులో పడి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికానందంకోసం కన్న బిడ్డలను కూడా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వింటూ ఉన్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో ప్రేమికుడితో సన్నిహితంగా ఉండటం కూతురు చూసిందని కన్నతల్లి  కూతుర్ని చంపి బావిలో పడేసింది.

Extra marital affair : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కూతుర్ని చంపిన కన్నతల్లి

Mother Killed Innocent Daughter In Raebareli

Mother Killed innocent daughter in Raebareli : అక్రమ సంబంధాల మోజులో పడి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికానందంకోసం కన్న బిడ్డలను కూడా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వింటూ ఉన్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో ప్రేమికుడితో సన్నిహితంగా ఉండటం కూతురు చూసిందని కన్నతల్లి  కూతుర్ని చంపి బావిలో పడేసింది.

రాయబరేలి లోని దాల్మయి కోట్ వ్యాలీ మండలం బలభద్రాపూర్ గ్రామంలో సంతోష్ కుమార్ భార్య రేణు, కూతురు ఆరుషి(5). తండ్రి చిట్టన్ తో కలిసి జీవిస్తున్నాడు. సంతోష్ ఉద్యోగ రీత్యా ముంబైలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు.

హోలీ పండుగ సందర్భంగా భార్య తన పుట్టింటికి వెళ్తానంటే మార్చి31న అత్తవారింట దింపి వచ్చాడు సంతోష్. పండుగ అయిపోయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అత్తావారింట్లో విచారించగా పండగ అయ్యాక వెళ్లిపోయినట్లు వాళ్లు తెలిపారు. భార్యా, కుమార్తె కోసం సంతోష్ గాలింపు చేపట్టాడు. ఈసమయంలో ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు. ఆమె తన ప్రియుడు సచిన్ తో కలిసి పక్క ఊరిలో ఉంటోందని చెప్పారు.

సంతోష్ ఆ ఊరు వెళ్లి తన భార్యను ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంటికి వచ్చాక కూతురు విషయం అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు అంతా గాలించారు. అయినా కూతురు ఆచూకి లభించలేదు.

మర్నాడు పక్క గ్రామంలోని వ్యవసాయ బావిలో ఒక బాలిక మృతదేహాం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. బాలిక వివరాలు సేకరించగా సంతోష్, కుమార్తె ఆరుషిగా తెలుసుకున్నారు. రేణును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లుగా అంగీకరించింది.

హోలీ పండగకి పుట్టింటికి వెళ్లిన రేణు, పండగ అయ్యాక ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది. కానీ పక్క గ్రామంలో ఉన్న తన ప్రియుడు సచిన్ వద్దకు వచ్చింది. అక్కడ వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసిన ఐదేళ్ల అరుషి తండ్రికి ఈవిషయం చెప్తానంది.

దీంతో భయపడిన సచిన్, రేణులు బాలికను గొంతుకోసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకే బావిలో పడేసినట్లు అంగీకరించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణు, ఆమె ప్రియుడు సచిన్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.